హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : దేశంలో కేవలం పేరుకే నవాబులు అని పిలిపించుకుంటూ, నిజజీవితంలో పూట గడువక కటిక పేదరికంలో మగ్గుతున్న ముస్లిం, ఇతర మైనారిటీల హకుల సాధన కోసం పోరాడుతున్నట్టు ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ నేతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలను విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం, మైనారిటీల సమస్యలు తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈక్రమంలో వారిని ఇందిరా పార్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉతంఠ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ రాజకీయ నేతల అండతో కొందరు వేల కోట్ల విలువైన మైనారిటీ, వక్ఫ్ భూములు అక్రమంగా కాజేస్తూ, కోట్లు సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో మైనారిటీల శాతానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జమీల్, ఖాలీద్, కలీమ్, రెహమాన్ పాల్గొన్నారు.