న్యూఢిల్లీ, జనవరి 31: స్కిల్ డెలవప్మెంట్ శిక్షణలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ భారతం వెనుకబడి ఉన్నదని 2021-22 ఆర్థిక సర్వే పేర్కొన్నది. ఏదేమైనా గత సంవత్సరాలతో పోల్చుకుంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు, మహిళల్లో నైపుణ్యాలు మెరుగయ్యాయని తెలిపింది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్, సరఫరా మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడం, ఒకేషనల్, టెక్నికల్ ట్రైనింగ్ ఫ్రేమ్వర్క్ నిర్మించడం, నైపుణ్యాలను పెంచడం తమ నైపుణ్యాభివృద్ధి లక్ష్యాల ప్రయత్నమని ప్రభుత్వం సర్వేలో పేర్కొన్నది.