న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కొత్త డైరెక్టర్గా హైదరాబాదీ స్టయిలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ నియామకం దాదాపు ఖరారైంది. చాన్నాళ్లుగా ఎన్సీఏ బాధ్యతలు చూసుకుంటున్న మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా హెడ్కోచ్గా ఎంపికవడంతో.. ఖాళీ అయిన ఆ స్థానాన్ని లక్ష్మణ్తో భర్తీ చేయనున్నారు. గతంలో ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన లక్ష్మణ్… బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రోద్బలంతో ముందుకొచ్చినట్లు సమాచారం. ‘వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ కొత్త డైరెక్టర్గా ఎంపికయ్యాడు’ అని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. త్వరలోనే అతడు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటార్గా తప్పుకున్న లక్ష్మణ్ ఇకపై కామెంట్రీకి కూడా దూరం కానున్నాడు. ద్రవిడ్, లక్ష్మణ్ మధ్య చక్కటి సమన్వయం ఉండటంతోనే బీసీసీఐ అతడికి ఎన్సీఏ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వచ్చే నెల 4న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.