‘మాంగళ్యం తంతునానేనా.. మన లైఫ్ లో ఇది జరుగునా…’అంటూ బాధతో పాట పాడుకుంటున్నారు హీరో శర్వానంద్. నా పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అనే విసుగు ఆయనలో కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లోనిదీ పాట. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు ఈ పాటకు సాహిత్యాన్ని కూడా అందించారు. కథానాయకుడి సోలో పాట ఇది. పెళ్లి మంత్రాన్ని పెళ్లి కావడం లేదన్న కథానాయకుడి బాధను కలిపి పాటలో రాశారు దేవి. తాజాగా ‘మాంగళ్యం..’ లిరికల్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటించింది. మార్చ్ 4న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.