న్యూఢిల్లీ: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇవాళ ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని, అబ్జర్వేషన్లో ఉంచామని ఓ డాక్టర్ తెలిపారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ గడిచిన నెల నుంచి కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు న్యూమోనియా ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. డాక్టర్ ప్రతిత్ సమ్దాని ఆమెకు చికిత్సను కల్పిస్తున్నారు. గాయని లతా మంగేష్కర్ ప్రస్తుతం ఐసీయూలో ఉందని, ఆమె వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నట్లు డాక్టర్ సమ్దాని తెలిపారు.