బర్మింగ్హామ్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ షట్లర్ లక్ష్యసేన్.. ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ఫేవరెట్గా బరిలోకి దిగిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టిన మెగాటోర్నీలో.. ప్రపంచ మూడో ర్యాంకర్ అండ్రెస్ అంటన్సెన్ (డెన్మార్క్)ను చిత్తు చేసిన లక్ష్య ముందంజ వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 20 ఏండ్ల లక్ష్యసేన్ 21-16, 21-18తో మూడో సీడ్ అంటన్సెన్పై విజయం సాధించాడు. గత వారం జర్మన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన లక్ష్య.. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మరో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 9-21, 21-18, 21-19తో సినిసుక గింటింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్ పీవీ సింధు 19-21, 21-16, 17-21తో సయాక తకహాషి (జపాన్) చేతిలో.. సైనా నెహ్వాల్ 14-21, 21-17, 21-17తో రెండో సీడ్ అకానే యామగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. మహిళల డబుల్స్లో గాయత్రి పుల్లెల-త్రిషా జాలీ జోడీలు విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి.