ముషీరాబాద్, డిసెంబర్ 24: జీవీఆర్ ఆరాధన కాల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో పలువురు టీవీ ఛానెల్స్ న్యూస్ రీడర్స్కు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని సీనియర్ జర్నలిస్టు సీతారామ శర్మకు జీవిత సాఫల్య పురస్కారం, పలువురు టీవీ యాంకర్స్కు పురస్కారాలను అందజేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ టీవీ ఛానెల్స్లోవ్యాఖ్యానం విభిన్న కళా ప్రక్రియ అని, ఎంతో మంది యువత ఛానెల్స్లో గొప్పగా రాణించడం అభినందనీయమన్నారు. చిల్లా రాజశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దామరాజు శ్రీనివాసరావు, రాంతిలక్, రవి కుమార్, జీవీఆర్ ఆరాధన కాల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, కృష్ణయాచార్య, ప్రహర్షిణి పాల్గొన్నారు.