నిజామాబాద్ : జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్బండార్ తండాకు చెందిన రవీందర్ దెగావత్ మృతదేహం బుధవారం స్వగ్రామమైన మానిక్బండార్కు చేరుకోగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. రవీందర్ వారం రోజుల క్రితం కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు రమేశ్ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాల మేరకు మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తెప్పించే బాధ్యతను జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, కువైట్ జాగృతి అధ్యక్షుడు ముత్యాల వినయ్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్కు అప్పగించారు.
ఈ మేరకు వారు మృతదేహాన్ని పంపేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం వరకు ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. కువైట్లో ఉన్న తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జాగృతి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మానిక్బండార్ తండా వాసులు జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత, ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.