కువైట్ : భారత్లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోగా.. బ్రిటన్ రెడ్లిస్ట్లో చేరింది. తాజాగా కువైట్ సైతం అదేబాట పట్టింది. ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు శనివారం తెలిపింది. నేరుగా భారత్ నుంచి వచ్చినా, ఇతర దేశాల మీదుగా వచ్చినా శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యాన్ అమలులో ఉంటుందని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
భారత్లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, కువైట్ పౌరులు, మొదటి డిగ్రీ బంధువులు (భర్త, భార్య, పిల్లలు), పని కార్మికులకు అనుమతి ఉంటుందని చెప్పింది. యూఏఈ నుంచి భారత్కు ప్రయాణికులకు వెళ్లేందుకు రెండుదేశాల మధ్య సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నిషేధంతో సరుకు రవాణాపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది.
ఇవికూడా చదవండి..