IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో మూడో రోజు భారత బౌలర్లు చెలరేగారు. దాంతో, ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి సెషన్ మొదలైన కాసేపటికే జో రూట్(18)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ డేంజరస్ జానీ బెయిర్స్టో(0), ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (153)లను ఔట్ చేసి భారత్ను పోటీలో నిలిపాడు.
ప్రస్తుతం కెప్టెన్ బెన్ స్టోక్స్(39 నాటౌట్), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(6 నాటౌట్)లు ఆడుతున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్కు పరుగులు జోడించారు. దాంతో, లంచ్ సమయానికి ఇంగ్లండ్ 290 రన్స్ కొట్టింది. స్టోక్స్ సేన ఇంకా 155 పరుగులు వెనకబడి ఉంది.
Stokes is looking in good touch; Kuldeep has been excellent this morning 👏 https://t.co/uNRzS8VZ65 | #INDvENG pic.twitter.com/5IFglNHpl9
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024
వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేనను చిత్తు చేసిన భారత్ కీలకమైన రాజ్కోట్ టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. తొలుత 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలిరోజు కెప్టెన్ రోహిత్ శర్మ(132), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(112)లు శతకాలతో కదం తొక్కారు. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46)లు ధనాధన్ ఆడడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 445 రన్స్ కొట్టింది.