హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కోయగూడెం నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెం దిన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడేనికి చెందిన శ్రీలత చిన్నతనం నుంచే చదువులో మం చి ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నది. ఇంటర్లో 97 శాతం మార్కులు సాధించింది. నాగర్కర్నూల్లో ని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో చదివి జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటీ వారణాసిలో ఇంజినీరింగ్ సీట్ సంపాదించింది. వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజు చెల్లించే పరిస్థితిలో లేరు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన కేటీఆర్.. తన సొంత డబ్బుతో శ్రీలత ఐఐటీ విద్య పూర్తయ్యే వర కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సోమవా రం ప్రగతిభవన్కు కుటుంబ సభ్యులతో వచ్చిన శ్రీలతను కేటీఆర్ అభినందించారు.
శ్రీలత లక్షల మందికి స్ఫూర్తి: కేటీఆర్
కడుపేదరికంలో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్ర జ్ఞాపాటవాలు ఎవరి సొత్తూ కాదని, కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని పేర్కొన్నారు. శ్రీలత లాంటి అద్భుత ప్రతిభ ఉన్న ఆడబిడ్డకు అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తున్నదని చెప్పారు. ఐఐటీలో చేరేందుకు అవసరమైన డబ్బును కేటీఆర్ అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. ఐఐటీలోనూ ప్రతిభ చాటాలని ఆశీర్వదించారు. అండగా నిలిచిన కేటీఆర్కు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.