హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): భారత్లో లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఔషధ పరిశోధనలకు ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్.. శనివారం ప్రపంచ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సోస్మిత్ైక్లెన్ (జీఎస్కే) యాజమాన్యాలతో వరుసగా సమావేశమయ్యారు.
పెట్టుబడులకు ఆసక్తి
హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగం విస్తరణపై అమెరికా ఫార్మా కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఫార్చ్యూన్ 500 జాబితాలోని ఫైజర్, జాన్సన్, జీఎస్కే సీనియర్ ప్రతినిధులకు హైదరాబాద్లోని పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ముందుగా ఫైజర్ సీఈవో, చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబల్ సైప్లె ఆఫీసర్ మైక్ మెక్ డెర్మాట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉవే సోన్ బెక్తో భేటీ అయ్యారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలోని అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి తెలిపారు. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మథాయ్ మమ్మన్ను కలిసి ఫార్మా పరిశోధనలకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలను వివరించారు.
జీఎస్కే సీటీవో ఆగమ్ ఉపాధ్యాయతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడంపై ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయి. కేటీఆర్ లాంటి విజనరీ.. మంత్రిగా ఉండటం భారత పారిశ్రామిక రంగానికే ఎంతో ప్రయోజనం అని వ్యాఖ్యానించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగే 20వ బయో ఏషియా సదస్సుకు రావాలని కేటీఆర్ ఆహ్వానించగా, కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ ఉన్నారు.