అగ్ర హీరో పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 21న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ను ఆయన కార్యాలయంలో చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ఆహ్వానించారు. తాను ఈ వేడుకకు వస్తానని కేటీఆర్ మాటిచ్చారు.
మంత్రి కేటీఆర్ అతిథిగా వచ్చేందుకు అంగీకరించినందుకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్క్రీన్ప్లే,మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా..సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రీరిలీజ్ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్గ్రౌండ్స్లో ఈ వేడుక జరగనుంది.