Beeram Lakshma Reddy | కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తండ్రి, సింగోటం లక్ష్మారెడ్డిగా సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సింగోటం లక్ష్మారెడ్డి పలుమార్లు సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు, రైతాంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి మరణం బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.