హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది. చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో బోర్డు భేటీ నిర్వహించనున్నది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను పంపాలని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను కోరింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని ఆయా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.