హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో యువ షట్లర్లు కృష్ణప్రియ, తరుణ్ పాల్గొన్నారు. టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి విసిరిన చాలెంజ్ను స్వీకరించిన కృష్ణప్రియ, తరుణ్ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి..మోకిల వద్ద తమ నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాంటినెంటల్ ఫౌండర్ డాక్టర్ గురునాథ్రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రఘునాథ్రెడ్డికి కృష్ణప్రియ గ్రీన్ చాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, గ్రీన్ఇండియా ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు. యువ షట్లర్లకు వృక్ష వేదం పుస్తకాన్ని రాఘవ అందజేశారు.