హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను తేల్చకుండా కేంద్రం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావు విమర్శించారు. ఏడేండ్లుగా కేంద్రం ముందు అనేక డిమాండ్లు పెట్టినా, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశా రు. సీఎం కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద కొత్త రాష్ట్రం ఏర్పడితే అన్ని వాటాలు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం అనేక విషయాల్లో తాత్సారం చేసిందని విమర్శించారు. ‘గోదావరి, కృష్ణాలో మా వాటా ఏంటి? తాగు నీరు, సాగునీరు, పరిశ్రమల కోసం.. రాష్ట్రం మనుగడ సాగించాలి కాబట్టి వెంటనే వాటా తేల్చాలి. గొప్ప కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇందుకు ఏడేండ్లు పట్టకూడదు.
మా ప్లానింగ్ కు మీరు చేస్తున్న తాత్సారం ప్రతిబంధకంగా మారుతు న్నది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి జల్శక్తి మంత్రిని, అవసరమైతే ప్రధానిని కలిసి నీళ్ల వాటా తేల్చాలని కోరుతామన్నా రు. వాటా తేల్చేందుకు నిర్ణీత కాలపరి మితి విధిం చాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, ఉద్యమా లు లేవదీస్తామని హెచ్చరిం చారు. ‘ఓపికకు హద్దు ఉం టది. ఏడేండ్లు గడిచినా న్యాయం జరగలేదు. కేంద్రం బాధ్యత నిర్వర్తించ డంలో విఫలమైంది. ఇక పోరాటం, ఆందోళనకు రూపకల్పన చేయాల్సి వస్తున్నది’ అన్నారు.
రిజర్వేషన్ల పెంపునకు అనుమతివ్వాలి
శాసనసభలో చాలా తీర్మానాలు చేసి పంపితే కేంద్రం నుంచి స్పందన లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీలో గిరిజనులు 6% ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ శాతం పెరిగింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకుంటామని కేంద్రాన్ని అడిగాం. 50 లెటర్లు రాశాం. కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే పెద్ద ఎత్తున గిరిజన పోరాటాలు చేస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, దాని మీద ఎస్ ఆర్ నో.. చెప్పాలని డిమాండ్ చేశారు.
కులగణన చేయాల్సిందే
వచ్చే జనాభా లెక్కల సేకరణలో ఓబీసీ కులగణన చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎవరి కులం ఎంతో తేలితే, దాన్నిబట్టి మంచో చెడో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వాలు లెక్కలు దాచిపెట్టడం సమంజసం కాదన్నారు. కులగణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారి తీస్తుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
ట్రిబ్యునల్ ఏర్పాటులో ఇంత తాత్సారమా?
రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలోనే నీటి వాటాలపై ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని కేంద్రానికి దరఖాస్తు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటమంటే వారి పరువును వారే తీసుకోవడం, బట్టలిప్పుడుకోవడమేనని ఎద్దేవా చేశా రు. ‘ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆలస్యమెందుకు? కేంద్రం రెఫర్ చేస్తానంటే కేసీఆర్ వద్దంటడా? బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా, రాష్ట్రంలో మ రోలా మాట్లాడుతరు. ఇదేం పద్ధతి? మనకు కూడా కేంద్రమంత్రి ఉన్నడుకదా.. ఆయ న్ను ఎవరాపుతున్నరు? ఎవరైనా ట్రిబ్యునల్ ఏర్పాటుకు చొరవ తీసుకోవచ్చు కదా? ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తరా? లేదా? అన్నది స్పష్టంచేయాలి’ అని డిమాండ్చేశారు.