తిరువనంతపురం, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే అమ్ముతున్నదని, తాము కొంటామన్నా ఇవ్వటం లేదని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేటుపరం చేయటానికి కేంద్రం సిద్ధం చేసిన కంపెనీలను తాము కొంటామని అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసినా స్పందించలేదని ఆరోపించారు. ఎలక్ట్రికల్ మెషిన్స్ లిమిటెడ్ (ఈఎంఎల్) పునఃప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరువనంతపురం ఎయిర్పోర్టు, హెచ్ఎల్ఎల్ కేరళ యూనిట్లో అమ్మకానికి పెట్టిన వాటాలు కొంటామని తెలిపామన్నారు.