దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్ ప్రాజెక్టు 32.6 అడుగులకు గాను 32.6 అడుగుల ( 2.27 టీఎంసీలు)నీటి నిల్వ కొనసాగుతుంది. గత రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి దాదాపుగా 7500 క్యూసెక్కుల వరద ప్రాజెక్టు కొనసాగుతుండటంతో శనివారం ఉదయం నుంచి అధికారులు 7 గేట్లు తెరిచి కిందికి 7500 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న వాగులోకి విడుదల చేశారు. మధ్యాహ్నం కొంత వరద తగ్గుముఖం కావడంతో 2 గేట్లు మూసి 5 గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగిం చారు. ప్రస్తుతం వస్తున్న వరదను బట్టి ప్రాజెక్టులో నీటిని హెచ్చు తగ్గులుగా విడుదల చేస్తామని అన్నారు. దీంతో వాగులో ఉన్న అన్ని చెక్డ్యాములు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. వాగు పరీవాహక ప్రాంతంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండా లని అధికారులు సూచించారు.