తిరుమల : ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతకుముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పులు, స్తంభాలు అన్నింటిలోనూ పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూయగా మొత్తం ఆలయం, దేవతా మూర్తులు, పూజా సామగ్రిని శుభ్రం చేశారు.
అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విశిష్ట తిరుమంజనం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు . సాధారణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ముందు సంవత్సరం ముందు మంగళవారం వీటిని నిర్వహిస్తమన్నారు.
అనంతరం పీఠాధిపతికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, వీఐపీ బ్రేక్ను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అధికారులు పాల్గొన్నారు.