ఆర్మూర్, డిసెంబర్ 5: ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికే ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లీనా ప్రదీప్, ఎంపీటీసీ లిఖితా మహేశ్, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, దేగాం వైద్యాధికారి భాస్కర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కల్లెం భోజారెడ్డి, పెంట భోజారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కల్లెం మోహన్రెడ్డి, సర్పంచులు దార్ల దీవేనా రాజు, సౌడ సాయిలతా మధువర్మ తదితరులు పాల్గొన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ..
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యాయామ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆదివారం కలిసి విన్నవించారు. పీఈటీలకు ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పీఈటీలను నియమించాలని, కేజీబీవీల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుల వేతనాలు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వచ్చేలా చూడాలన్నారు. మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంఈవో పింజ రాజగంగారాం, టీజీ పేటా జిల్లా అధ్యక్షుడు బద్దం గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాల రాజాగౌడ్, కోశాధికారి కస్తూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బట్టు రాజరాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి గన్న గంగదాస్ పాల్గొన్నారు.
అంగన్వాడీలు విస్తృతంగా సేవలు అందించాలి..
అంగన్వాడీలు విస్తృతంగా సేవలు అందించాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచించారు. ఆర్మూర్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీలు ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మెరుగైన సేవలను అందించిన అంగన్వాడీలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, సూపర్వైజర్లు నళిని, శ్రీదేవి, కంప్యూటర్ ఆపరేటర్ అర్చన, పోషణ్ అభియాన్ అధికారులు సవిత, అనిల్, అంగన్వాడీల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి తార తదితరులు పాల్గొన్నారు.