తన రాబోయే చిత్రాలన్నీ ఆసక్తికర కథలలో తెరకెక్కుతుండటం థ్రిల్లింగ్గా ఉందని చెబుతున్నది బాలీవుడ్ నాయిక కియా రా అద్వానీ. ఈ సినిమాలన్నీ తనకు నటి గా పేరుతో పాటు బాక్సాఫీస్ విజయాలను అందిస్తాయని ఆమె నమ్ముతున్నది. ‘కబీర్ సింగ్’,‘గుడ్ న్యూస్’,‘లక్ష్మీ’,‘ఇందూ కీ జవానీ’,‘షేర్షా’లాంటి చిత్రాలన్నీ ఆమెను బిగ్ లీగ్లో చేర్చాయి. ఈ క్రేజ్ను మరింత పెంచేలా తన కొత్త సినిమాలు ఉండటం సంతోషాన్ని ఇస్తున్నదని చెబుతున్నదీ తార. తాజాగా కియారా అద్వానీ మాట్లాడుతూ…‘నా కొత్త సినిమా ‘భూల్ భులయ్యా 2’ రిలీజ్కు రెడీగా ఉంది. ఈ నెల 20న తెరపైకి వస్తున్నది. చిత్రీకరణలో ఉన్న ‘గోవింద్ నామ్ మేరా’, ‘జుగ్ జుగ్ జీయో’ సినిమాలు వేటికవి భిన్నమైనవి. ‘గోవింద్ నామ్ మేరా’ఒక కొత్త తరహా సినిమా. దీన్ని ఫలానా జానర్ సినిమా అని పిలవలేం. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ‘జుగ్ జుగ్ జీయో’మానవ సంబంధాల నేపథ్యంతో సాగే సినిమా. మన కథే అనిపిస్తుంది. ‘ఆర్సీ 15’నా తొలి పాన్ ఇండి యా మూవీ. రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’అని చెప్పింది.