మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నరు. ఆయన నాకు మిత్రుడే. ఆయనకంటే నాకు గౌరవమే. ఆయనతో నాకేం పంచాయితీ ఏంలేదు. ఆయన కూడా తప్పులు మాట్లాడుడు ధర్మం కాదు. బడ్జెట్ను నేను అర్థం చేసుకోలేదట. ఆయనకు ఏం అర్థమయ్యిందో. తలా తోకలేని బడ్జెట్. నాకు అర్థం కాకపోవడానికి దాంట్లో ఏముంది? రూ.34,900 కోట్ల్ల ఎరువుల సబ్సిడీ తగ్గించింది వాస్తవం కాదా? ఆహార సబ్సిడీని రూ.65 వేల కోట్లు తగ్గించింది వాస్తవం కాదా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లు తగ్గించింది అబద్ధమా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది కేవలం రూ.12,800 కోట్లు నిజం కాదా? ఈ ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వంలో మనిషికి, జట్టుకి 300 వస్తయ్ ఇగ ప్రగతే ప్రగతి. తుపాకిరాముని ప్రగతి. ఇంక దానికి మా మీద నిందలు వేస్తరా. ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామంటే రెడీ. ఈ దేశాన్ని నడిపే పద్ధతి ఇది కాదు. కరోనా వచ్చింది.. దేశం నాశనమైంది.. బడ్జెట్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచలె. వైద్యానికి పెంచలే. ఇది నిజం కాదా? మాకు అర్థమైంది చెప్పినం. ఉన్నదంతా బయటపెట్టినం. అర్థం కానిది కేసీఆర్కా. కిషన్ రెడ్డికా తేల్చుకోవాలి. మాకేదో అర్థం కానట్టు.. అడ్డం పొడుగు మాట్లాడుడు, పిచ్చిపిచ్చి మాట్లాడుడు, ఇది సరియైన పద్ధతి కాదు. బడ్జెట్ మీద మాకు అవగాహన లేదని మాట్లాడిన కిషన్రెడ్డి గారు.. అవగాహన నీకు లేకుంటే చేసుకొనే ప్రయత్నం చెయ్యు. మాకు అవగాహన లేదని చెప్పడం సమంజసం కాదు. ఇప్పుడు మర్యాదగ చెప్తున్న. మరోసారంటే చాలా కఠినంగా చెప్పాల్సి వస్తది జాగ్రత్త. రాష్ట్రం నుంచి ఉన్న మంత్రివని మర్యాద పాటించి చెప్తున్న.