కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురూ మాట్లాడుతూ…‘ప్రస్తుతం మా సినిమా రెగ్యులర్ చిత్రీకరణ తిరుపతిలో జరుపుతున్నాం. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో 80 శాతం షూటింగ్ పూర్తి చేస్తాం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఉంటుంది’ అన్నారు.