సార్బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ సూపర్-500లో భారత్ పోరాటం ముగిసింది. శనివారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 18-21, 12-21 తేడాతో లోకీన్ యు (సింగపూర్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 46 నిమిషాల్లో ముగిసిన పోరులో లక్ష్యసేన్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయాడు. తొలి గేమ్ను 18-21తో చేజార్చుకున్న లక్ష్య.. మలి గేమ్లో వరుస పాయింట్లు సమర్పించుకుని మ్యాచ్ను చేజార్చుకున్నాడు. మరో సెమీస్లో సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 19-21, 20-22తో లీ జీ జియా (మలేషియా) చేతిలో పోరాడి ఓడాడు. 44 నిమిషాల పాటు సాగిన పోరులో శ్రీకాంత్ అద్భుత పోరాట పటిమ చూపించాడు.