సార్బ్రూకెన్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం శ్రీకాంత్ 21-11, 12-21, 21-19తో మూడో సీడ్ అంగుస్ లాంగ్ (హాంకాంగ్)పై
విజయం సాధించాడు.