సినీరంగంలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుతమైన అవకాశాలు వరించాయని..విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులు తనను స్వీకరించారని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘భూల్ భూలయ్య-2’త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది కియారా అద్వాణీ. ‘కబీర్సింగ్’ (తెలుగు ‘అర్జున్రెడ్డి’ రీమేక్) తన కెరీర్కు మంచి బ్రేక్నిచ్చిందని చెప్పింది. అక్కడి నుంచి వరుస విజయాలు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. హీరోలతో సమానంగా తనకు స్క్రీన్స్పేస్ దక్కుతుండటం ఓ గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. శంకర్-రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం తన కెరీర్లో మరో మైలురాయిలా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘శంకర్ సర్ సినిమా స్కూల్ అంటేనే అదొక కొత్త ప్రపంచం. ఆయన ఆలోచనలు, మేకింగ్ ైస్టెల్ విభిన్నంగా ఉంటాయి. పొలిటికల్ డ్రామాగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేను నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది’ అని కియారా అద్వాణీ పేర్కొంది. ఇక నుంచి సంవత్సరానికో దక్షిణాది చిత్రంలో నటిస్తానని చెప్పింది.