హైదరాబాద్, ఆట ప్రతినిధి: మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్గేమ్స్లో తెలంగాణ పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో స్వర్ణం, సహా రజతం, కాంస్య పతకాలు దక్కాయి. బాలుర ట్రిపుల్జంప్ ఈవెంట్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన కొత్తూరి ప్రణయ్ పసిడి పతకంతో మెరిశాడు. 14.95 మీటర్ల దూరం లంఘించిన ప్రణయ్ స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు బాలికల 100మీటర్ల హర్డిల్స్లో రుచిత(14.30సె) రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో సబితా తోపో(13.96సె), గ్లాడిసా(14.76సె) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. పురుషుల జూనియర్ సైక్లింగ్ కైరీన్ రేసులో ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకంతో మెరిశాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఆరు కాంస్య పతకాలతో 14వ స్థానంలో కొనసాగుతున్నది.
శభాష్ ప్రణయ్: మంత్రి కొప్పుల
పసిడి పతకంతో మెరిసిన గురుకుల విద్యార్థి ప్రణయ్ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు.