లింగాలఘనపురం, మే 23: రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సీఎం కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొస్తున్న మార్పులు, చూపిస్తున్న శ్రద్ధ భేషుగ్గా ఉన్నదని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ హేమసుస్మిత ప్రశంసించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో సేంద్రియ వ్యవసాయ విధానంపై ఆమె అధ్వర్యంలోని ఏపీ బృందం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావుతో కలసి సోమవారం స్టడీటూర్ నిర్వహించారు. స్థానిక రైతులు తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, రాయితీలు, తాము చేస్తున్న సాగు, పంటల దిగుబడి గురించి వారికి వివరించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని హేమసుస్మిత కొనియాడారు. త్వరలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్రావు, అధికారులను ఏపీకి ఆహ్వానించనున్నట్టు ఆమె వివరించారు.