హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్ధులు అయ్యారని ఆల్ ఇం డియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రెడ్డి కీర్తించారు. దేశ రాజకీయాల్లో అనేక మంది నాయకులు, పార్టీలు హామీలిచ్చి విస్మరించిన చరిత్రనే చూశామ ని, కేసీఆర్ మా త్రం ఎన్నికల కోణంలో కాకుండా ప్రజల జీవితాలు బాగుపడాలన్న లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు స్ఫూ ర్తితో రాష్ట్రంలోని మిగతా పేదవర్గాలకు కూడా ‘పేదల బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్కు లేఖ రాశారు. ఏకకాలంలో అన్ని వర్గాలను సంతృప్తి పరచటం సాధ్యం కాదని, భవిష్యత్లో దశలవారీగా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా పేదలబంధును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సరికొత్త సంక్షేమమార్గాన్ని వేశారని ఆయన తెలిపారు.