హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం స్కాం.. నరేంద్రమోదీ సృష్టించిన కుంభకోణం అని కేసీఆర్ స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రలో బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్కుమార్ కీలక సూత్రధారి అని, అతడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం వల్లనే తనపై కక్ష గట్టారని చెప్పారు. అందులో భాగంగానే తన కూతురు కవితపై కేసుపెట్టి అరెస్టు చేశారని మంగళవారం రాత్రి టీవీ9 బిగ్ డిబేట్లో చెప్పారు.
జవాబు: లిక్కర్ స్కాం బోగస్. అది నరేంద్రమోదీ సృష్టి. కుంభకోణం ఎక్కడుంది? అది ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం. ఈ పాలసీ అన్ని రాష్ర్టాలకు ఉంటుంది. దీనిలో నుంచి నా కూతురు కడిగిన ముత్యం లాగా బయటికి వస్తది. కవితకు లిక్కర్ స్కాంకు ఏ మాత్రం సంబంధంలేదు. కవితను మొదట సీబీఐ వాళ్లు సాక్షిగా విచారించారు. ఇయ్యాల అపరాధి అంటున్నారు. వాట్ ఇజ్ దిస్. మూడు సంవత్సరాల నుంచి అదే ప్రశ్న. ఇంకో ప్రశ్న లేదు. ఎక్కడా ఒక్క రూపాయి రికవరీ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకపోయి జైల్లో పెట్టారు. అది నియంతృత్వానికి పరాకాష్ఠ. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇవ్వరా? ముఖ్యమంత్రి పారిపోతాడా..? కవిత కూడా ఎమ్మెల్సీ . ఆమె పారిపోతుందా? ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బెయిల్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడం ఏమిటి? ఈ దేశంలో ఏం జరుగుతున్నది? గాల్లో కట్టుకథ అల్లారు. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను అడ్డం పెట్టుకొని ఆయన చేత ఆర్డర్ ఇప్పించి, స్కాం పరిశోధన చేయాలని చెప్పి, సీబీఐ, ఈడీకి ఇచ్చి, అనవసరంగా అమాయకులను నరేంద్రమోదీ శిక్షిస్తున్నారు.
జవాబు: నరేంద్రమోదీ 700 మంది ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తీసుకున్నారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలను కూల్చారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి దొరికిపోయారు. వాళ్లను పట్టుకొని జైల్లో ఉంచాం. దీంట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కుమార్ మూల సూత్రధారి. బీజేపీ సెంట్రల్ ఆఫీసులో ఉండే ఆయనను అరెస్ట్ చేయమని పోలీసులను పంపించాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షతో నా కూతురు మీద అనవసరంగా కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు. ఆడపిల్ల అని చూడకుండా నిర్బంధించి ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. దీని ద్వారా కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేయవచ్చు అని బీజేపీ అనుకున్నది. దాని ఫలితం అనుభవిస్తారు. తెలంగాణ ప్రజలు చూపిస్తారు.
జవాబు: అది ఆరోపణే కదా. కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తి బీజేపీకి రూ.50కోట్లు ఎన్నికల బాండ్ ఇవ్వడంతో బెయిల్ ఇచ్చారు. దానికేం సమాధానం చెప్తారు. అసలు అది స్కాం కాదు. అది నరేంద్రమోదీ పొలిటికల్ స్కీం. నరేంద్రమోదీ గవర్నమెంట్ సృష్టించిన కాకమ్మ కథ అది. అమాయకులను అనవసరంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో మూడుసార్లు పరాభవానికి గురై అతని మీద గెలిచే శక్తి లేక అతన్ని స్కటిల్ చేయడానికి, అతని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఇక్కడ మమ్ముల కూడా ఇబ్బంది పెట్టడానికి కేజ్రీవాల్ను, కవితను అరెస్ట్ చేశారు. మాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం, నమ్మకం ఉన్నాయి. ఫైట్ చేస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్, కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. నాకు విశ్వాసం ఉంది.