నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో మంగళవారం గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో పట్టణంలోని దేవరకొండ రోడ్ లోని లెప్రసీ హెల్త్ సెంటర్లో గల దాదాపు 400 మంది లెప్రసి రోగులకి, అనాథ వృద్ధులకి, స్కూల్ విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ కార్యకమాన్ని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు బర్డ్ కేక్ ను కట్ చేసి, స్వీట్లు కూడా పంచి పెట్టారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.
అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటకండ్ల దామోదర రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతల వెంకట్ రెడ్డి, TNGOs అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, లెప్రసీ హెల్త్ సెంటర్ డైరెక్టర్ అంబిక, కమ్యూనిటీ సుపీరియర్ సీసిలి, మాజీ జడ్పీటీసీ పసల శౌరయ్య, మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.