బెంగళూరు: బెంగళూరులో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ మంగళవారం ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలతో వచ్చే నెల 7 నుంచి అకాడమీ కార్యకలాపాలు మొదలవుతాయని నిర్వాహకులు గేమ్ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు మంగళవారం ప్రకటించాయి. బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచస్థాయి కోచింగ్ సౌకర్యాలతో బీసీసీఐ గుర్తింపు పొందిన కోచ్ల సమక్షంలో యువ క్రికెటర్లకు శిక్షణనిస్తామని గేమ్ప్లే యజమాని దీపక్ భట్నాగర్ మీడియాకు వివరించాడు.