బెంగళూరు, ఏప్రిల్ 15: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మైను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఇటీవల సంతోష్ పాటిల్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో ఈశ్వరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తక్షణం ఆయన్ను క్యాబినెట్ నుంచి తొలగించాలని రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కేసులో పోలీసులు ఆయన్ను మొదటి నిందితుడిగా చేర్చారు. కాంట్రాక్టు పని డబ్బులు రావాలంటే 40 శాతం కమీషన్ ఇవ్వాలంటూ మంత్రి ఈశ్వరప్ప వేధించారని, భరించలేక అత్మహత్య చేసుకుంటున్నానంటూ సంతోష్ తన సూసైట్ నోట్లో పేర్కొన్నాడు.