కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ లేక్ పోలీసులు కాపాడారు. ఇరువురిని రెస్క్యూ చేసిన పోలీసులు కౌన్సిలింగ్ అనంతరం ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. రాములు(62) అనే వృద్ధుడు కుటుంబ సమస్యల కారణంగా జీవితాన్ని ముగించాలనుకున్నాడు. ఎల్ఎండీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న రాములుని పెట్రోలింగ్లో ఉన్న లేక్ పోలీసులు గుర్తించి కాపాడారు.
మరొక ఘటనలో కరీంనగర్ పట్టణంలోని అశోక్నగర్కు చెందిన వివాహిత భర్త షేక్ జమీల్ వేధింపులు తట్టుకోలేక లోయర్ మానేరులో దూకేందుకు నిశ్చయించుకుంది. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని రక్షించారు. ఇద్దరి వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యలను పిలిచి అప్పగించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ వి. వెంకట్ రెడ్డి తెలిపారు.