తెలంగాణ చౌక్, మార్చి 14 : రాజన్న సిరిసి ల్ల జిల్లాకేంద్రంలోని నెహ్రూనగర్ ప్రభుత్వ పాఠశాల సమైక్య పాలనలో విద్యార్థుల్లేక కళ తప్పింది. అప్పటి పాలకులు నిధులివ్వక పోవడంతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. కేవలం 55 మంది విద్యార్థులే ఉండడంతో మూతపడే పరిస్థితికి చేరింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ‘బడిబాట’ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇంగ్లిష్ బోధనకు అనుమతిలిచ్చింది. అలాగే మౌలిక వసతులకు నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో యేటేటా పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఇప్పుడు ఏకంగా 388కి చేరింది.
అంకితభావమే ఆయుధంగా..
బాడిబాటలో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో ముందుకుసాగారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. ప్రైమ రీ నుంచి హిందీ సబ్జెక్టును బోధించేలా చర్యలు చేపట్టారు. విద్యార్ధులకు మార్షల్ ఆర్ట్స్లో దున్నిస్తున్నారు. దాతల సహకారంతో మెరుగైన వసతు లు కల్పించారు. ఈ పరిస్థితుల్లో ఈ స్కూల్ వి ద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతి సంవత్సరం నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకుల ప్రవేశ పరీక్షల్లో సుమారుగా 15 మంది విద్యార్థులు పాఠశాల నుంచే ఎంపికవుతున్నారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో..
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ పాఠశాలల్లో పలు స్వచ్ఛంద సంస్థలు మౌలిక సదుపాయల రూపకల్పనలో ముందుంటున్నాయి. నెహ్రూనగర్ పాఠశాలలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో విద్యార్థులకు డ్యూయ ల్ డెస్కులు అందుబాటులోకి వచ్చాయి. వీక్ ఏ మేక్ ఏ చేంజ్, నేను నా పల్లే అనే రెండు స్వచ్ఛం ద సంస్థలు పాఠశాల ఆవరణలోని గోడలకు ప్ర ముఖులు, జాతీయ నాయకుల చిత్రాలు, పాఠ్యాశంలోని ఇతర బొమ్మలను విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా సుమారు రూ.50వేలు ఖర్చుచేసి పెయింటింగ్స్ వేయించాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా పాఠశాల హెచ్ఎం గణేశ్, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు శుద్ధమైన తాగునీరందించేందుకు ఆర్వో వాటర్ ప్లాం ట్ ఏర్పాటు చేశారు. రీడ్ టూ రూం, సహకృత ఫౌండేషన్, సత్యసాయి, అర్కమిత్ర ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు విద్యప్రోత్సాహ నిమి త్తం కంప్యూటర్లు, మైక్ సౌండ్ సిస్టమ్స్తో పాటు గా విద్యార్థులు విద్యపరమై పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సాహక బహుమతుల్లో భాగంగా ఉచితంగా అల్పాహారం, నోట్బుక్స్, షూ, ప్రతి గురువారం విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేస్తూ పురోగతికి సహకరిస్తున్నారు.
నాడు నిల్.. నేడు ఫుల్
కనీస సంఖ్యలో విద్యార్థులు వస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి 2019-20లో ప్రీ ప్రైమరీతో కలిపి దాదాపు 240 మంది చేరడంతో పాఠశాల కళకళలాడుతున్నది. గతేడాది అడ్మిషన్లు ఫుల్కావడంతో ప్రవేశం కోసం వచ్చిన పలువురు వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నరు..
ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నరు. మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల కంటే మంచిగా పాఠాలు చెబుతున్నరు. పిల్లలు ఏదైనా కారణంతో ఒక రోజు స్కూల్కు వెళ్లకపోతే ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకుంటున్నరు. మా నిర్లక్ష్యం ఉంటే కోపానికి కూడా వస్తున్నరు. అంతలా శద్ధచూపుతున్నరు. బడుల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. పిల్లలు ఏ లోటూ లేకుండా చదువుకుంటున్నరు. చాలా సంతోషంగా ఉంది.
– సబ్బని నరేశ్, పేరెంట్
నమ్మకాన్ని పెంచాం..
పాఠశాలలో మొదటగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచాం. ప్రైవేట్కు దీటుగా బోధించడం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది. పోషకవిలువతో ఆహారం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాంలతో పాటు నాణ్యమైన విద్య అందించడంతో ఊళ్లోని పిల్లలంతా మా స్కూల్కే వస్తున్నరు.
– కే గణేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ప్రైవేట్ కంటే బాగా చెప్తరు..
ఆంగ్లం అంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే నేర్పుతారు అనుకున్నాం. మా పాఠశాలలో అక్కడి కంటే మంచిగా చెప్పుతున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఇంగ్లీష్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మా సార్లు పాఠాలు బాగా చెప్పుతున్నారు. ఆటపాటలతో, క్విజ్ పోటీలు తరగతి గదిలో కూర్చునేందుకు డ్యూయల్ డెస్కులు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం చాలా రుచిగా ఉంటుంది. సౌకర్యాలు చాలా బాగున్నాయి.
– ఆడెపు వినీల, 5వ తరగతి