గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్, డిసెంబర్ 6: జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. సీఎం సభకు జనసమీకరణ ఏర్పాట్లపై మంగళవారం ఆయన మండల కేంద్రంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొండూరి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సమష్టి కృషి తో గ్రామాల వారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సూచించారు. అందరి సహకారంతో సభను విజయవంతం చేద్దామని కోరారు. ఇక్కడ సర్పంచ్ కటకం శ్రీధర్, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ భూపతి సురేందర్, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, సర్పంచులు అల్లె సత్యం, అజ్మీరా బాల్యానాయక్, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, కమ్మరి రాజారాం, లక్కిరెడ్డి లత, పెద్దవేని వెంకటియాదవ్, గంద్యాడపు రాజు, చెవుల మల్లేశం, బిల్లా రాజు, ఎగదండి స్వామి, పిట్ల శ్రీమతి, వీరబోయిన రమే శ్, శివరాత్రి నర్సింహులు, రత్నాకర్, తలారి అంజ య్య, మీను, కిశోర్, అభిలాష్, దోసల రాజు, రాజేందర్, బీమ్లానాయక్, దోసల శంకర్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్యకర్తలతో టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమావేశమయ్యారు. పలువాడల్లో కాలినడకన పర్యటించి ప్రజలతో ముచ్చటిస్తూ సీఎం సభకు వెళ్లేందుకు పలు సూచనలు చేశారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు బండారి బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు ఎన్గందుల నర్సింహులు, నంది కిషన్, మాద ఉదయ్, చామంతుల అనిల్, బాద రమేశ్, మేగి నర్సయ్య, మెండె శ్రీనివాస్యాదవ్, తదితరులు తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచులు, మహిళలతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభకు తరలిరావాలని జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్పర్సన్ శీలం జానాబాయి, పార్టీ మండలాధ్యక్షుడు సురేందర్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి కోరారు. ఇక్కడ నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సాదుల్పాషా, శీలం సాయి, రాజు ఉన్నారు.