కొత్తపల్లి, డిసెంబర్ 6: మలేషియాలోని కౌలాలంపూర్లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన ఇరిగేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి రమేశ్ను మంగళవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాలువాతో సత్కరించారు. టీఎన్జీవోస్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, టీఎన్జీవోస్ కరీంనగర్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న తాళ్లపల్లి రమేశ్ ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో మూడు కిలోమీటర్ల నడక పోటీల్లో సత్తాచాటి పతకం కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి ఇరిగేషన్ శాఖకు, ఉద్యోగులకు, టీఎన్జీవో సంఘానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. నాయకులు రాగి శ్రీనివాస్, మారుపాక రాజేశ్ భరద్వాజ్, నేరెళ్ల కిషన్, రవీందర్రెడ్డి, సబితారెడ్డి, గంగారపు రమేశ్గౌడ్, విజయ్కుమార్, కరుణాకర్, ఎం రాజేశ్వర్రావు, వెలిచాల శ్రీనివాస్రావు, పవన్కుమార్, సుస్మిత పాల్గొన్నారు.