హుజూరాబాద్ టౌన్, నవంబర్ 28 : పోలీసు శాఖలో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోలీస్ శాఖ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు సామాజిక సహాయకర్త వద్దినేని రవీందర్రావు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శారీరక దృఢత్వం కోసం శిక్షణ అభ్యర్థులు ఈ రంగంలో నిష్ణాతులైన వారి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 8 నుంచి జరగబోయే ఫిట్నెస్ టెస్ట్కు అందరూ సిద్ధం కావాలని సూచించారు. ఈపరీక్షలో క్వాలిఫై అయిన వారు మెయిన్ పరీక్షలో నెగ్గడం సులభమని అన్నారు. ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ, మానసిక ప్రశాంతతకు మెడిటేషన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా నేటి యువత దేశ సంపదగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. దీనిలో హుజూరాబాద్ టౌన్ సీఐ వీ శ్రీనివాస్, పారిశ్రామికవేత్త పుల్లూరు ప్రభాకర్రావు, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, పీ వెంకట్రెడ్డి, ప్రతాప కృష్ణ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చింత శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రమేశ్, మాజీ అధ్యక్షుడు రవీందర్బాబు, నాయకులు వేల్పుల రత్నం, సలీం, ఆకుల సదానందం, కొన్ని రాజిరెడ్డి, సొల్లు అనిల్, ప్రభాకర్రెడ్డి, పంజాల శ్రీధర్గౌడ్, మధూకర్పటేల్, విద్యానంద్, రమేశ్, కొలిపాక సారయ్య, మునీరుద్దీన్, మోరెమధు, ఎంఏ సలీం, రాజేందర్ రవీందర్రావు, ప్రభాకర్,కుమార్గౌడ్ పాల్గొన్నారు.