కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్థానం వద్ద ఆది వారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా రేణుక అమ్మవారు నాల్గోవ రోజు లలితాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిం ది. కార్యక్రమంలో ఈవో సత్యమూర్తి, చైర్మన్ యాదగిరి, అలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.