బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరికి భిన్నంగా ఆలోచించి కళాఖండాలను తయారు చేయడం అలవాటు చేసుకున్నాడు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనందున అమ్మవారికి రూపాయల నోట్లను హారంగా వేయడాన్ని చూసి అందుకు భిన్నంగా నాణేలతో కలశం తయారు చేసి సమర్పించాలని నిర్ణయించుకున్నాడు.
రెండు రోజుల పాటు 2001 రూపాయి నాణేలను సేకరించి వాటిని అతికిస్తు అందంగా పేర్చి కలశం మాదిరిగా తయారు చేశాడు. అమ్మవారి ఆశీర్వాదంతో తాను ఈ ప్రయత్నం చేశానని, త్వరలో కలశాన్ని అమ్మవారికి సమర్పిస్తానని ఎంబు కిషన్ తెలిపాడు.