హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghose) రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలు, విచారణపై చర్చించారు. కాగా, గురువారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావుతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. న్యాయ విచారణలో భాగంగా రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన మేడిగడ్డతోపాటు ఇతర బరాజ్లు, ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు.
బీఆర్కే భవన్లో ఇరిగేషన్శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవల జారీ చేసిన మధ్యంతర సిఫారసులపై కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ఆ దిశగా పనులు చేపట్టాలని కూడా ఆదేశించినట్టు సమాచారం.