న్యూఢిల్లీ, ఆగస్టు 15: అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తోటి న్యాయమూర్తులకు సూచించారు. న్యాయ వ్యవస్థ బలం న్యాయం అందించడమేనని, లైన్లో నిలబడిన చివరి వ్యక్తికి కూడా న్యాయం అందేలా చూడాలని నొక్కిచెప్పారు. మంగళవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిధిలో పాలనా సంస్థలు పనిచేసేలా చూడటంలో మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఒక ముఖ్యమైన పాత్రను అందించిందని సీజేఐ పేర్కొన్నారు.
అదనంగా 27 కోర్టులు..
సుప్రీంకోర్టు విస్తరణ ప్రణాళికపై కూడా సీజేఐ మాట్లాడారు. అదనంగా 27 కోర్టులు, నాలుగు రిజిస్ట్రార్ రూమ్లు ఏర్పాటు చేసేలా, న్యాయవాదులు, పిటిషర్దారులకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా ఓ కొత్త భవన నిర్మాణం చేIndependence Day Celebrationsపట్టాలనే ప్లాన్ ఉన్నదని చెప్పారు.