హైదరాబాద్,మార్చి 25(నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’ పిలుపుమేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు.
తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మా ట్లాడుతూ ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బండి విజయకుమార్, వల్లాల జగన్, కే పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.