అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల ప్రవాహం సృష్టించాడు. గతంలో 2016 సీజన్లో కోహ్లీ కూడా నాలుగు సెంచరీలు చేశాడు. ఆ సీజన్లో కోహ్లీ 973 రన్స్ చేశాడు.
ఇక బట్లర్ ఈ సీజన్లో ఇప్పటికే 824 రన్స్ చేశాడు. 58.86 సగటుతో అతను ఈ పరుగులు సాధించాడు. ఇక స్ట్రయిక్ రేట్ 151.47గా ఉంది. ఈ సీజన్లో బట్లర్ తన ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా వేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నది.