అహ్మాదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్లో ఔటైన తీరు పట్ల స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. టోర్నీలో భారీ స్కోర్లతో అలరించిన బట్లర్ ఫైనల్ మ్యాచ్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసినా జట్టును విజయపథంలో నడపలేకపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్కు ఆరంభంలో నిరాశ ఎదురైంది. యశశ్వి జైశ్వాల్, సంజూ సామ్సన్ త్వరగా ఔటైన తర్వాత హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో 39 రన్స్ చేసి బట్లర్ ఔటయ్యాడు. డగౌట్కు వెళ్తున్న క్రమంలో అతనిలో ఆవేశం కట్టలు తెంచుకున్నది. కోపంతో తన హెల్మెట్ను విసిరేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇదే.
— Cred Bounty (@credbounty) May 29, 2022
131 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. గిల్ 45, హార్ధిక్ 34, మిల్లర్ 32 రన్స్ చేశారు. ఫైనల్లో ఆటతీరుతో బట్లర్ నిరాశ చెందినా.. సీజన్లో 863 రన్స్ చేసిన అతనికే ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఒక సీజన్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో బట్లర్ ఇప్పుడు రెండవ స్థానంలో నిలిచాడు. 2016 సీజన్లో వార్నర్ 848 రన్స్ చేశాడు. అతన్ని ఇప్పుడు బట్లర్ బీట్ చేశాడు. 2016 సీజన్లో కోహ్లీ 973 రన్స్ చేసి ఆ జాబితాలో ఫస్ట్ ఉన్నాడు.