నాగర్కర్నూల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాడూర్ మండలంలోని భలాన్పల్లి గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.
వారికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు.