పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్ద రాత్ పల్లికి చెందిన వివిధ పార్టీల యువకులు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని గుర్తు చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రతి పక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.