నల్లగొండ : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, పథకాలకు ఆకర్షితులై చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలంతొండ్లయి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది మహిళలు మాజీ సర్పంచ్ చింత ప్రమీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు, చింత ప్రకాష్, చింత ఎల్లమ్మ, చింత నర్సమ్మ, మంగమ్మ, లింగమ్మ, రజిత, బింగి శంకరమ్మ, చింత రవి, మహేష్ తదితరులు ఉన్నారు.