ఎడ్జ్బాస్టన్: మాస్టర్క్లాస్ ఆటతో జో రూట్ ఆకట్టుకుంటున్నాడు. భారత్తో జరుగుతున్న అయిదో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో జో రూట్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతనికి ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఆడుతున్న బ్యాటర్లలో రూట్ ఖాతాలోనే అత్యధిక సెంచరీలు ఉన్నాయి. భారీ టార్గెట్తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దాదాపు విక్టరీకి చేరువైంది. రూట్ తన క్లాసిక్ స్ట్రోక్ప్లేతో ఈజీగా ఆడేశాడు. జట్టు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన రూట్ బౌండరీలతో అలరించాడు. తొలుత అలెక్స్ లీస్ను రనౌట్ చేసినా.. ఆ తర్వాత బెయిర్స్టోతో కలిసి ధీటైన ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఇండియాపై అయిదో టెస్టులో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రస్తుత బ్యాటర్లలో కోహ్లీ(27), స్టీవ్ స్మిత్(27), కేన్ విలియమ్సన్(24), వార్నర్(24) లు ఉన్నారు.